లేఖనములు
మొరోనై 5


అధ్యాయము 5

సంస్కారపు ద్రాక్షారసమును నిర్వహించు విధానము వివరించబడినది. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 ద్రాక్షారసమును నిర్వహించు విధానమిది—వారు పాత్రను తీసుకొని, ఇట్లు చెప్పిరి:

2 ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, ఈ ద్రాక్షారసమును దానిని త్రాగుచున్న వారందరి ఆత్మల కొరకు ఆశీర్వదించి, పరిశుద్ధపరచమని మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో మిమ్ములను అడుగుచున్నాము; తద్వారా వారి కొరకు చిందించబడిన మీ కుమారుని రక్తము యొక్క జ్ఞాపకార్థము వారు దానిని చేసి, ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొందురని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక. ఆమేన్.